Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వ్యాపారి- రూ.78 లక్షలు స్వాహా.. ఎక్కడ?

Advertiesment
scam

సెల్వి

, బుధవారం, 16 అక్టోబరు 2024 (12:27 IST)
స్టాక్‌లపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న ఒక వ్యాపారవేత్త తన స్నేహితుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అయితే, సెబీ రిజిస్టర్డ్ సంస్థగా చెప్పుకున్న మోసగాళ్లు అతడి నుంచి రూ.78 లక్షలను స్వాహా చేశారు. 
 
ఈ ఘటనపై నాచారంకు చెందిన 44 ఏళ్ల వ్యాపారి బాధితుడు మాట్లాడుతూ.. తనకు స్టాక్‌లు, షేర్లపై అవగాహన తక్కువేనని, వాటిపై ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. చివరగా, భారీ నష్టాన్ని చవిచూశానని వాపోయాడు. 
 
ఆర్బీఎల్ సెక్యూరిటీస్ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తుల నుండి వాట్సాప్‌లో సందేశాలను స్వీకరించడం ప్రారంభించానని, వారు బీఎస్ఈలో రిజిస్టర్ చేయబడిన సంస్థగా పేర్కొని.. మోసానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు 
 
తొలుత రూ.80,000 సంపాదించాను. నెల రోజుల తర్వాత తమ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఇలా కొంచెం కొంచెం పెట్టుబడి పేరిట ముంచేశారని చెప్పాడు.
 
ఇంకా బాధితుడు మాట్లాడుతూ.. "నా దగ్గర నిధులు లేకపోయినా, నేను డబ్బు అప్పుగా తీసుకుని మళ్లీ పెట్టుబడి పెట్టాను. కానీ వారు మరింత పెట్టుబడిని డిమాండ్ చేయడంతో, అది మోసమని  గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాను" అని చెప్పాడు. ఈ ఘటనపై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు బీఎన్‌ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీఎస్ఎన్ఎల్ ఫెస్టివల్ ఆఫర్స్.. రూ.500 కంటే ఎక్కువ రీఛార్జ్‌ చేస్తే?