Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే..?

దీపారాధనకు ఉపయోగించే వత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపారాధన తూర్పు వైపు దిశగా చేయాలి. అయితే దీపారాధన ద్వారా ఉత్తమ ఫలితాలను పొందాలంటే.. శ్రేష్ఠమైన వత్తులను ఎంచుకోవాలి

పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే..?
, సోమవారం, 27 ఆగస్టు 2018 (12:58 IST)
దీపారాధనకు ఉపయోగించే వత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపారాధన తూర్పు వైపు దిశగా చేయాలి. అయితే దీపారాధన ద్వారా ఉత్తమ ఫలితాలను పొందాలంటే.. శ్రేష్ఠమైన వత్తులను ఎంచుకోవాలి. కాటన్‌ దుస్తులతో పసుపు రాసిన వత్తులను వెలిగించడం ద్వారా దుష్ట శక్తుల ప్రభావం వుండదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే దూదితో తయారైన వత్తులను వెలిగించడం శుభకరం. అరటికాడతో తయారైన వత్తులను వెలిగించడం ద్వారా సంతాన భాగ్యం చేకూరుతుంది. పట్టు నూలుతో తయారైన వత్తులతో దీపమెలిగిస్తే.. సమస్త శుభాలు చేకూరుతాయి. తామర కాడలతో తయారైన వత్తులతో దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. ఇక కొబ్బరినూనెతో దీపమెలిగిస్తే ఆరోగ్యం, సిరిసంపదలు చేకూరుతాయి. 
 
నువ్వులనూనెతో దీపమెలిగిస్తే.. శత్రుబాధ వుండదు. యమభయం తొలగిపోతుంది. నేతితో దీపం వెలిగిస్తే.. సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. మట్టితో తయారు చేసిన ప్రమిదలతో దీపమెలిగిస్తే.. కొత్త శక్తి, కొత్త ఉత్సాహం చేకూరుతుంది. 
 
దీపాన్ని ఆర్పేటప్పుడు పూవుతో వత్తాలి. నోటితో వూదడం చేయకూడదు. దీప సరస్వతీ అంటూ మూడు సార్లు, దీపలక్ష్మీ అని మూడు సార్లు, దీప దుర్గా అని మూడుసార్లు పలకాలి. కులదైవం పేరును మూడుసార్లు ఉచ్చరించి దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని 12సార్లు నమస్కరిస్తే.. ఆ ఇంట సకల సంపదలు చేకూరుతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోమవారం (27-08-2018) దినఫలాలు - మనసు లగ్నం చేసి పనిపై శ్రద్ధ పెట్టినా ...