Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శరన్నవరాత్రులు అక్టోబర్ 3 నుంచి ప్రారంభం..

Navaratri

సెల్వి

, సోమవారం, 23 సెప్టెంబరు 2024 (17:56 IST)
శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024న ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు, భక్తులు దుర్గాదేవికి పూజలు చేస్తారు. ఆ మాతపై భక్తితో నిమగ్నమై, ఆమెను వివిధ రూపాలలో కొలుస్తారు.  
 
శరన్నవరాత్రులు అక్టోబర్ 3, 2024న ఉదయం 12:19 గంటలకు ప్రారంభమవుతుంది. అక్టోబర్ 12, 2024న దసరాతో ముగుస్తాయి. నవరాత్రి ప్రారంభాన్ని సూచించే కలశం లేదా ఘటస్థాపన ఒక ముఖ్యమైన ఆచారం. ఘటస్థాపనకు అనుకూలమైన సమయం అక్టోబర్ 3, 2024న ఉదయం 6:24 నుండి 8:45 వరకు ఉంటుంది. 
 
అదనంగా, అభిజిత్ ముహూర్తం, మరొక అనుకూలమైన సమయం, మధ్యాహ్నం 11:52 గంటల నుంచి 12:39 గంట మధ్య జరుగుతుంది. తొమ్మిది రోజుల నవరాత్రిలో మొదటి మూడు రోజులూ దుర్గాదేవికి అంకితం, తరువాతి మూడు రోజులూ లక్ష్మికి అంకితం, అలాగే ఆఖరి మూడు రోజులూ సరస్వతికి అంకితం. పదవ రోజైన విజయదశమి, జీవితంలోని ఈ మూడు అంశాలపై పరిపూర్ణమైన విజయాన్ని సూచిస్తుంది.
 
ఇకపోతే.. దుర్గగుడి ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి వివిధ రకాలుగా నైవేద్యాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టి దుర్గమ్మ ఆశీర్వాదాన్ని పొందుతారు. 
 
అలాగే నవరాత్రుల్లో ప్రతి రోజూ ఒక రంగు చీర కడతారు. తొమ్మిది అలంకారాలకు తొమ్మిది రకాలు చీరలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లడ్డూల్లో జంతుకొవ్వు.. తగ్గేదేలేదంటున్న భక్తులు.. ఊపందుకున్న విక్రయాలు