Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోక్‌సభ బరిలో బాలీవుడ్ తారలు : భోపాల్ నుంచి కరీనా.. పూణె నుంచి మాధురీ

Advertiesment
Kareena Kapoor
, మంగళవారం, 22 జనవరి 2019 (09:34 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో పలువురు సినీ తారలు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులోభాగంగా, బాలీవుడ్ అగ్రహీరోయిన్లుగా ఉన్న మాధురీ దీక్షిత్, కరీనా కపూర్‌లు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తరపున పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా, భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కరీనా కపూర్, పూణె నుంచి బీజేపీ తరపున మాధురీ దీక్షిత్‌లను బరిలోకి దిగే సూచనలు ఉన్నట్టు సమాచారం. 
 
సినిమా నటులను ఎన్నికల బరిలోకిదించే సంప్రదాయం రెండు పార్టీలకు ఉన్నా ఈసారి కొంత గ్లామర్ సొబగులను అద్దాలని యోచిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్.. లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని యోచిస్తున్నది. 
 
కాంగ్రెస్ పార్టీ 1984 తర్వాత భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందలేదు. దీంతో పూర్వ నవాబ్ కుటుంబ కోడలైన బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ను భోపాల్ నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. యువతలో కరీనాకు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెల్సిందే. అలాగే, బీజేపీ కూడా మాధూరీ దీక్షిత్‌ను బరిలోకి దించాలని భావిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దురదృష్టం అంటే ఇదీ... ఓటు వేయని సర్పంచ్ అభ్యర్థి.. ఒక్క ఓటు తేడాతో ఓడాడు...