Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Love : శోభనం రోజే నవ వధువు షాక్.. ప్రేమతో జ్యూస్-తాగితే విషం.. తర్వాత ఏమైంది?

Advertiesment
Marriage

సెల్వి

, సోమవారం, 3 మార్చి 2025 (20:31 IST)
Marriage
ప్రియుడి కోసం భర్తకు పెళ్లైన మొదటి రోజే షాకిచ్చింది ఓ నవవధువు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కడలూరుకు చెందిన కలైయరసన్ అనే 27 ఏళ్ల యువకుడికి ఓ యువతితో జనవరి 27, 2025న వివాహం జరిగింది. అదే రోజు నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. 
 
అయితే శోభనం గదిలోకి వెళ్లగానే నవ వరుడికి షాక్ తప్పలేదు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని నవవధువు చెప్పింది. అంతటితో ఆగకుండా ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పాటు తన ప్రియుడితోనే సంసారం చేస్తానని తెగేసి చెప్పేసింది. భర్త ముందే వీడియో కాల్ ద్వారా ప్రియుడితో మాట్లాడింది. దీంతో వరుడు ఏం చేయాలో తెలియక శోభనం గది నుంచి బయటికి వచ్చేశాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పేశాడు. 
 
ఫిబ్రవరి 12 భార్యను తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్లాడు. కానీ నవ వధువు కుటుంబీకులు కలైయరసన్ ఆమెతోనే సంసారం చేయాలని చెప్పి పంపారు. ఇంతటితో ఈ కథ ముగిసిందనుకుంటే.. మూడు రోజుల తర్వాత భర్తకు జ్యూస్‌లో భార్య విషం కలిపి పెట్టింది. 
 
వెంటనే కలైయరసన్ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. నవ వధువుపై కలైయరసన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో POCO M7 5G.. ఫీచర్లు, ధరలు గురించి తెలుసా?