Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మే 17తర్వాత ఏం చేద్దాం..? ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ

Advertiesment
Coronavirus
, మంగళవారం, 12 మే 2020 (09:42 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ నెల 15 నాటికి తదుపరి చర్యలపై బ్లూ ప్రింట్ ఇవ్వాలని సీఎంలకు సూచించారు. ఒక వేళ లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే.. ఆ తర్వాత వచ్చే సమస్యలను ఎలా అధిగమించాలో కూడా పంపాలని సీఎంలను మోదీ కోరారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ మహమ్మారి పరిణామాలు, భారత్‌లో కేసుల సంఖ్య, రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులపై ప్రతి ఒక్క సీఎం అభిప్రాయాన్ని ప్రధాని తీసుకున్నారు. మూడో విడత లాక్‌డౌన్‌ తర్వాత కొన్ని నిబంధనల్ని అమలు చేస్తూనే సాధారణ జనజీవనం వైపు దేశాన్ని నడిపించాల్సిన అవసరాన్ని ప్రతి ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. మే 17తర్వాత కొన్ని సడలింపులకు కేంద్రం కూడా సంసిద్దత వ్యక్తం చేసింది. 
 
అయితే పేరుకు మాత్రమే లాక్ డౌన్ వుంటుంది.. కేవలం రెడ్‌జోన్‌లు, కంటైన్‌మెంట్‌ జోన్లలోనే నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా భౌతిక దూరాన్ని పాటించడం తప్పనిసరి. అయితే, ఇప్పుడు లాక్‌డౌన్ నాలుగు ఎలా వుంటుందనేది నిర్ణయించాల్సి వుంది. మే 15కల్లా రాష్ట్రాలు ఇచ్చే నివేదికలను కేంద్రం రెండు రోజుల పాటు పరిశీలిస్తుంది. ఇంకా మే 17వ తేదీన ఏం చేయాలనే అంశంపై కేంద్రం పరిశీలిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ కేకుల్లా స్పెషల్ ట్రైన్ టిక్కెట్లు.. జస్ట్ 20 నిమిషాల్లో ఖాళీ