Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో డెల్టా ప్లస్ తొలి మరణం - అప్రమత్తమైన బీఎంసీ

ముంబైలో డెల్టా ప్లస్ తొలి మరణం - అప్రమత్తమైన బీఎంసీ
, శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:50 IST)
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డెల్టా ప్లస్ వైరస్ సోకిన వ్యక్తి మరణించాడు. మన దేశంలో డెల్టా ప్లస్‌తో చనిపోయిన తొలి కేసు ఇదే. జూలై 27వ తేదీన 63 ఏళ్ల వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు సమాచారం. 
 
జూలై 21వ తేదీన ఆ వ్య‌క్తి పాజిటివ్‌గా తేలింది. ఆ పేషెంట్‌కు డయాబెటిస్‌తో పాటు ప‌లు ర‌కాల రుగ్మ‌త‌లు ఉన్నాయ‌ని అధికారులు చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న త‌ర్వాత ఆ మ‌హిళ‌కు వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. అయితే మృతిచెందిన వ్య‌క్తికి మాత్రం ట్రావెల్ హిస్ట‌రీ లేద‌ని అధికారులు చెప్పారు. 
 
కాగా, ముంబైలో ఏడు మందికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ సోకిన విష‌యం తెలిసిందే. ఆమె నుంచి సేక‌రించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ రిపోర్ట్ బుధ‌వారం వ‌చ్చిది. ఆమెతో స‌న్నిహ‌త సంబంధం క‌లిగి ఉన్న మ‌రో ఇద్ద‌రికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేధింపుల కేసుపెట్టిన భార్య - ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్