Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భోజనంలో వెంట్రుక వచ్చిందనీ.. భార్యకు గుండుకొట్టించిన భర్త.. ఎక్కడ?

sadist
, సోమవారం, 12 డిశెంబరు 2022 (13:51 IST)
తినే ఆహారంలో వెంట్రుక వచ్చిందన్న ఆగ్రహంతో కుటుంబ సభ్యుల ముందే తన భార్యను ఓ ప్రబుద్ధుడు గుండు కొట్టించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫిలిబిత్ జిల్లా మిలాక్ అనే గ్రామానికి చెందిన జహీరుద్దీన్ - సీమాదేవి (30) అనే దంపతులు ఉన్నారు. ఏడేళ్ల క్రితం వీరికి వివాహమైంది. శుక్రవారం రాత్రి సీమాదేవి తన భర్తకు ఆహారం వడ్డించింది. అందులో ఓ వెంట్రుక కనిపించడంతో జహీరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల ముందే భార్యను చితకబాదాడు. వారి ముందే గుండు కొట్టాడు. 
 
ఈ అవమానాన్ని భరించలేని సీమాదేవి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనకు గుండు కొట్టించాడని, పైగా, రూ.15 లక్షల కట్నం తీసుకుని రావాలంటూ అత్తింటివారు వేధిస్తున్నారంటూ ఆమె పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు జహీరుద్దీన్‌ను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్‌లకు జియో సపోర్ట్..