Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శబరిమలలో మకరజ్యోతి దర్శనం

Advertiesment
Makarjyoti darshan
, గురువారం, 14 జనవరి 2021 (22:22 IST)
శబరిమలలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్ప నామస్మరణతో శబరిమల మార్మోగుతోంది. పొన్నాంబలమేడు కొండల్లో జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. అంతేకాదు మకరజ్యోతిని దర్శనం వల్ల భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

మకరజ్యోతి దర్శనం కోసం శబరిమల భక్తజనం తరలివచ్చింది. పంబ, పులిమేడ్, నీలికల్ ప్రాంతాల్లో జ్యోతి వీక్షణకు ఏర్పాట్లు చేశారు. శబరిమలలో కోవిడ్ నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిచ్చారు. పంబ నుంచి సన్నిధానం వరకు అయ్యప్ప భక్తులు వేచి ఉన్నారు.

భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఇరుముడులతో వచ్చిన అయ్యప్పలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మకర సంక్రాంతి రోజు జ్యోతిని దర్శించుకుంటే సాక్షాత్తు అయ్యప్పస్వామి కనపడినట్లుగా భక్తులు భావిస్తారు. అందుకనే జ్యోతికి ప్రతి ఏడాది ఎక్కువగా అయ్యప్పలు వస్తుంటారు. అందువల్ల మకర సంక్రాతికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

29 నుంచి లోక్‌సభ సమావేశాలు