Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్నేహితురాలి ఎదురుగానే మరో విద్యార్థినిపై అత్యాచారం.. వీడియో తీసి..?

Advertiesment
Madhya pradesh
, గురువారం, 26 ఆగస్టు 2021 (17:36 IST)
ముగ్గురు విద్యార్థులు స్నేహితురాలి ఎదురుగానే మరో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. స్నేహితురాలి ఒత్తిడి మేరకే ఆ విద్యార్థిని ముగ్గురు నిందితులతో పాటు మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని మండుకు వెళ్లినట్లు సమాచారం. 
 
ఆ ఘటన మొత్తాన్ని ఆమె వీడియో తీయడంతో పాటు ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరింపులకు దిగినట్లు విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. పూజా నర్వారియా, ఆశిష్‌, నిపుల్‌, పునీత్‌లతో కలిసి ఆగస్ట్‌ 23న బాధితురాలి నివాసానికి వచ్చింది.
 
తాము మండుకు వెళుతున్నామని.. తనకు తోడుగా రావాలంటూ బాధితురాలిని కోరింది. ఐదుగురు కలిసి లసుదియా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆశిష్‌ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌కు చేరుకున్నారు. సాయంత్రం నాలుగుగంటల సమయంలో .. నిందితుడు బాధితురాలికి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ను ఇచ్చారని.. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగానే ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని అన్నారు. 
 
ఈ ఘటన మొత్తాన్ని బాధితురాలి స్నేహితురాలు వీడియో తీసినట్లు తెలిపారు. బాధితురాలిని నలుగురు నిందితులు కొట్టడంతో పాటు వారు చెప్పినట్లు చేయాల్సిందేనని బెదిరించినట్లు తెలిపారు. కాగా, ఫిర్యాదు అందిన వెంటనే నిందితుల కోసం గాలింపు చేపట్టామని ఇండోర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అశుతోష్‌ బాగ్రి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమ‌ల వెంక‌టేశునికి మ‌హింద్రా సిఇఓ జీపు విరాళం!