Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. కర్ణాటకలో ఒక్కరోజే 141 మంది మృతి

Advertiesment
Coronavirus
, శనివారం, 29 ఆగస్టు 2020 (07:52 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్క రోజే 141 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 5,232కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,09,792కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసుల్లో బెంగళూరులో 3,357 పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరులో 1,18,728కి చేరుకోగా, 35,989 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 2,19,554 మంది కోలుకోగా, 84,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక 747 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
 
మరోవైపు దేశంలో ఒకే రోజులో 77,266 కోవిడ్‌ కేసులు యాక్టివ్‌ కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనా కరోనాను పుట్టించేందుకు ముందే వ్యాక్సిన్ కనిపెట్టిందా? విస్తుపోయే నిజాలు