Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వృద్ధుడుని కొమ్ములతో పైకెత్తి.. నేలకేసి కొట్టి.. కాళ్లతో తొక్కేసిన ఎద్దు (Video)

Advertiesment
Bull attacks

ఠాగూర్

, శుక్రవారం, 6 జూన్ 2025 (10:26 IST)
ఢిల్లీ ఛత్తర్‌పూర్‌లో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిపై ఎద్దు ఒకటి దాడి చేసింది. కొమ్ములతో పైకెత్తి, నేలకేసి కొట్టి, కాళ్లతో తొక్కేసింది దీన్ని గమనించిన స్థానికులు ఆ వృద్ధుడుని అతి కష్టంమీద ప్రాణాలతో రక్షించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధుడుని ఆస్పత్రికి చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ భయానక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తర్‌పూర్‌లో ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ వృద్ధుడు తన స్కూటర్ దగ్గర నిల్చుని ఉండగా, ఎక్కడినుంచో దూసుకొచ్చిన ఓ భారీ ఎద్దు అతడిపై దాడి చేసింది. తన పదునైన కొమ్ములతో ఆ వ్యక్తిని పైకి లేపి, కిందపడేసి, కాళ్లతో విచక్షణారహితంగా తొక్కింది. ఆ తర్వాత బాధితుడిని రోడ్డు మధ్యలోకి ఈడ్చుకెళ్లి మళ్లీ దాడి చేసింది. 
 
ఈ దృశ్యాలు చూసిన స్థానికులు వెంటనే స్పందించి, కర్రలు, రాడ్లతో ఎద్దును తరిమివేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎద్దును బెదిరించబోయిన ఒక మహిళను కూడా అది కిందకు తోసేసింది. చివరకు, అతికష్టం మీద స్థానికులు బాధితుడిని కాపాడి, చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
 
ఢిల్లీలో వీధి పశువుల దాడులు కొత్తేమీ కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కల్కాజీ ఎక్స్టెన్షన్లోని సెయింట్ జార్జ్ స్కూల్ బయట సుభాశ్ కుమార్ ఝా (42) అనే వ్యక్తిపై ఓ ఎద్దు దాడి చేయడంతో అతను మరణించాడు. తన కొడుకును స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ దాడిలో అతని పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే నెలలో దక్షిణ ఢిల్లీలోని తిక్రీ ప్రాంతంలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
 
తాజాగా ఛత్తర్పూర్లో జరిగిన ఘటనతో నగర ప్రాంతాల్లో వీధి పశువుల సమస్యపై మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోపై ఒక సోషల్ మీడియా యూజర్ స్పందిస్తూ, "ఇది భారతదేశ ప్రజలకు పెద్ద సమస్య. రోజూ ఇలాంటి వీడియోలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదైనా చేయాలి. జంతువులతో ప్రమాదాల్లో ప్రజలు చనిపోతున్నారు. ఎద్దులు రోడ్లపై మనుషుల్ని చంపుతున్నాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు.
 
కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తున్న డెయిరీల వల్లే ఈ వీధి పశువుల సమస్య తలెత్తుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దాడులు అనేకం జరిగాయని, వాటిలో పలువురు గాయపడ్డారని వారు తెలిపారు. ఈ తాజా ఘటనతో ఢిల్లీ నగర ప్రాంతాల్లో వీధి జంతువుల సమస్యను అధికారులు తక్షణమే పరిష్కరించాల్సిన ఆవశ్యకత మరోసారి స్పష్టమైంది. బాధితుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్టి దస్తులు ధరించే మహిళలు రాక్షసి శూర్పణఖలు : బీజేపీ మంత్రి కైలాస్ విజయ్