Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిన్నారుల ప్రాణాలు తీసే 'బ్లూ వేల్‌ ఛాలెంజ్'... సుప్రీం ఏమంటోంది?

చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది.

Advertiesment
Blue Whale Challenge
, బుధవారం, 23 ఆగస్టు 2017 (06:34 IST)
చిన్నారుల ప్రాణాలు బలిగొంటున్న 'బ్లూ వేల్‌ ఛాలెంజ్‌'పై ఏం చర్యలు తీసుకున్నారో తెలిపాలని ఫేస్‌బుక్‌, గూగుల్‌, యాహూను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. బ్లూవేల్‌ లింకులకు సంబంధించి ఆయా సంస్థలకు తక్షణ ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది గుర్మీత్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. 
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ సి.హరిశంకర్‌ కూడిన ధర్మాసనం దీనిపై కేంద్రానికి, అటు ఢిల్లీ పోలీసులకు సైతం ఏయే చర్యలు చేపట్టారో చెప్పాలంటూ నోటీసులు ఇచ్చింది. చిన్నారుల ప్రాణాలను తీస్తున్న 'బ్లూవేల్‌ ఛాలెంజ్‌' గేమ్‌కు సంబంధించిన లింకులు తొలగించాలని ఆయా సంస్థలకు ఇటీవల కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఏవేం చర్యలు తీసుకున్నారో తెలుపుతూ నివేదిక సమర్పించాలని ఆయా సంస్థలకు హైకోర్టు సూచించింది. ఈ నెల 28లోగా తమ స్పందన తెలపాలని పేర్కొంది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పిల్లికి ఎలుక సాక్ష్యం' అంటే ఇదే... ఉగ్రవాదంపై పాక్‌ను వెనకేసుకొచ్చిన చైనా..!