Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సార్వత్రిక ఎన్నికలు : ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

Advertiesment
Phase5
, సోమవారం, 6 మే 2019 (08:59 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 51 నియోజకవర్గాలకుగాను మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదంయ ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
 
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ వంటి రాజకీయ దిగ్గాజాలు కూడా పోలింగ్‌లో బరిలో ఉన్నారు. 
 
ఈ ఎన్నకలు 7 రాష్ట్రాల్లోని 81 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా, మొత్తం 8,75,88,722 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో స్త్రీలు 4,12,82,166 మంది ఉంటే 4,63,03,342 మంది పురుషులు, 2214 మంది ఇతరులు ఉన్నారు. వీరి కోసం 96088 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, జిల్లాల్లోని ఐదు చోట్ల రీపోలింగ్ కొద్ది సేపటి క్రితమే ప్రారంభంమైంది. అదేవిధంగా తెలంగాణలో తొలిదశ పరిషత్ పోలింగ్ కూడా కాసేపటి కిందటే ప్రారంభం అయింది. 2166 ఎంపిటిసీ, 197 జడ్పీటీసీ స్థానాలకులకు పోలింగ్ జరుగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటరిగా ఉన్న మహిళ... తలుపులు వేసి కోర్కె తీర్చమన్న యువకుడు