Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shubhanshu Shukla: జూలై 14న ఐఎస్ఎస్ నుంచి శుభాన్షు శుక్లా టీమ్ తిరుగు ప్రయాణం

Advertiesment
Shubhanshu Shukla

సెల్వి

, శుక్రవారం, 11 జులై 2025 (19:33 IST)
Shubhanshu Shukla
భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు సిబ్బందితో సహా ఆక్సియం-4 మిషన్ (Ax4) సిబ్బంది జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఆక్సియం స్పేస్ షేర్ చేసిన ప్రకటన ప్రకారం, ఆక్సియం స్పేస్ సిబ్బంది సోమవారం ఉదయం 7:05 ET (సుమారుగా సాయంత్రం 4:30 గంటల) కంటే ముందుగా స్పేస్ స్టేషన్ నుండి అన్‌డాక్ చేయనున్నారు.
 
ఈ మేరకు ఎక్స్ పోస్ట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. జూలై 10న ఈ బృందం తిరుగు ప్రయాణం ప్రారంభించాల్సి ఉంది. అయితే, అసలు షెడ్యూల్ ప్రకారం సిబ్బంది భూమికి తిరిగి రారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారి బసను కనీసం నాలుగు రోజులు పొడిగించారని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తెలిపింది. 
 
జూన్ 25న ఫ్లోరిడాలోని NASAకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్‌లోని లాంచ్ కాంప్లెక్స్ 39A నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో ఆక్సియమ్ మిషన్ 4 ప్రయోగించబడింది. జూన్ 26న సాయంత్రం 4:05 గంటలకు డ్రాగన్ అంతరిక్ష నౌక ఐఎస్ఎస్‌తో విజయవంతంగా డాక్ చేయబడింది. 
 
షెడ్యూల్ కంటే ముందే, స్టేషన్ హార్మొనీ మాడ్యూల్ అంతరిక్ష-ముఖంగా ఉన్న పోర్ట్‌కు కనెక్ట్ అయింది. ఆక్సియమ్ మిషన్ 4 సిబ్బంది శాస్త్రీయ అధ్యయనాలను ముందుకు తీసుకెళ్లడం, కొత్త సాంకేతికతలను పరీక్షించడం.. అంతరిక్ష పరిశోధనలో ప్రపంచవ్యాప్త ప్రయత్నాలను కొనసాగించడం లక్ష్యంగా విస్తృత శ్రేణి పరిశోధన కార్యకలాపాలను నిర్వహించారని ఆక్సియమ్ స్పేస్ మంగళవారం తన మిషన్ బ్లాగ్‌లో పంచుకుంది. శుభాన్ష్ సిబ్బంది సూక్ష్మగురుత్వాకర్షణపై పరిశోధనలు నిర్వహించారు. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా మూడు ప్రయోగాలు నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2026లో కొత్త ఉత్పత్తులను విడుదల చేయనున్న ఆపిల్.. ఐఫోన్ 17e ఎప్పుడంటే?