ఫిరోజ్పూర్: ఫిరోజ్పూర్లోని గురుహర్ సహాయ్లో ఆదివారం నాడు విషాద సంఘటన చోటుచేసుకున్నది. స్థానిక క్రికెటర్ హర్జిత్ సింగ్ ఆదివారం ఉదయం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా సిక్స్ కొట్టిన కొద్దిసేపటికే గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలి మరణించాడు. ఈ సంఘటన డి.ఎ.వి. స్కూల్ మైదానంలో జరిగింది. ఈ ఘటన మొబైల్ ఫోన్లో రికార్డయ్యింది.
49 పరుగులు చేసి బాగా ఆడుతున్న హర్జిత్ సింగ్, భారీ షాట్ కొట్టిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఆటగాళ్ళు సహాయం చేయడానికి పరుగెత్తారు, కానీ అతడిని బ్రతికించలేకపోయారు. వృత్తిరీత్యా వడ్రంగి అయిన సింగ్ చురుకైన జీవనశైలికి, క్రికెట్ పట్ల ప్రేమ వున్నవాడు. అతని అకాల మరణంతో స్థానిక ప్రజలు దిగ్భ్రాంతి చెందారు.