Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బొలీవియా అధ్య‌క్షురాలికి క‌రోనా

Advertiesment
Corona
, శుక్రవారం, 10 జులై 2020 (10:21 IST)
కరోనా దేశాధ్యక్షులనూ వదలడం లేదు. ఇప్పటికే పలువురు నేతలను ఆసుపత్రి పాలు చేసిన ఈ మాయదారి మహమ్మారి.. తాజాగా బొలీవియా తాత్కాలిక అధ్య‌క్షురాలు జీనిన్ అనెజ్‌ ను ఆవహించింది.

ఈ మేర‌కు ఆమె త‌నకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, ఐసోలేష‌న్‌లో ఉండి ప‌ని చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఆమె మంత్రివ‌ర్గంలోని న‌లుగురికి కూడా ఈ మ‌ధ్యే పాజిటివ్ అని వ‌చ్చింది. దీంతో ఆమె ప‌రీక్ష‌లు చేసుకోగా త‌న‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు తేలింది.

దీంతో క‌రోనా బారిన ప‌డ్డ దేశాధ్య‌క్షుల సంఖ్య రెండుకు చేరింది. ఇంత‌కుముందు బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్స‌నారోకు క‌రోనా సోకింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగరి ఎమ్మెల్యే రోజా గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్..