Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మధుమేహం వ్యాధి ఎందుకు వస్తుంది? లక్షణాలు ఏమిటి?

Advertiesment
world diabetes day
, శనివారం, 14 నవంబరు 2020 (22:48 IST)
నవంబర్ 14 వరల్డ్ డయాబెటిస్ డే. మధుమేహం ఎందుకు వస్తుంది? మన శరీరానికి చక్కెర (గ్లూకోజ్‌) ఎంతో అవసరం. యంత్రం పనిచేయాలంటే శక్తి అవసరం. అలాగే శరీరానికి కూడా. అందుకు కావలసిన శక్తిని ఇచ్చేది చక్కెర మాత్రమే. అందువల్ల మానవ దేహంలో గ్లూకోజ్‌ ఎలా తయారవుతుంది, ఎలా నిల్వ ఉంటుంది, ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలను తెలుసుకోవడం అందరికీ అవసరం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి దారి తప్పినా అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ అనారోగ్యాన్నే మధుమేహ వ్యాధి (డయాబెటిస్‌) అంటారు.
 
దీనికే మరోపేరు చక్కెర వ్యాధి. శరీరంలో చక్కెర హెచ్చుతగ్గుల వల్ల కలిగే అనారోగ్యాన్ని వ్యాధి అని అంటున్నా, నిజానికి ఇది వ్యాధి కాదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ డయాబెటిస్‌ను అదుపులో ఉంచగలిగితే మనిషి ఎంతకాలమైనా హాయిగా జీవించగలడు.
 
మనం ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో చక్కెర ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా అదనంగా ఉత్పత్తి అయిన చక్కెర కాలేయం (లివర్‌)లో నిల్వ ఉంటుంది. మనం శారీరకంగా ఎక్కువ కష్టపడితే, కణాలకు ఎక్కువ శక్తి అవసరమవుతుంది. అంటే ఎక్కువ చక్కెర (గ్లూకోజ్‌) కావాలన్నమాట. దీనిని లివర్‌ అందిస్తుంది. ఇదికాక ఇంకా అదనపు చక్కెర నిల్వ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు వస్తుంది. ఇదే డయాబెటిస్‌! దీనివల్ల మూత్రపిండాల (కిడ్నీస్‌) పైన అధిక భారం పడుతుంది.
 
మన దేహంలోని పాంక్రియాస్‌ అనే అవయవం ఇన్‌సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పాంక్రియాస్‌ జీర్ణకోశానికి పక్కనే ఉంటుంది. చక్కెరను జీర్ణం చేయడంలో పాంక్రియస్‌దే కీలకపాత్ర. చక్కెరను గ్లూకోజ్‌గా మార్చి నిల్వచేయడం, వివిధ శరీర భాగాలకు పంపించడమూ పాంక్రియస్‌ బాధ్యత. 
 
వ్యాధి లక్షణాలు : 
* త్వరగా అలసిపోవడం, నీరసం 
* శరీరం నిస్సత్తువగా మారడం 
* పనిలో ఆసక్తి లేకపోవడం 
* నాలుక తడారిపోవడం, విపరీతమైన దాహం 
* తడవ తడవకూ మూత్ర విసర్జన చేయడం 
* ఎక్కువ ఆహారం తీసుకుంటున్న శరీరం బరువు తగ్గిపోవడం 
* కంటి చూపు మందగించడం 
* కీళ్ళనొప్పులు 
* ఒంటినొప్పులు 
* రోగ నిరోధక శక్తి తగ్గడం. తరచు వ్యాధులకు గురికావడం 
* కడుపులో నొప్పి 
* చర్మం మంటగా ఉండటం. గాయాలు త్వరగా మానకపోవడం 
* వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం 
* సెక్స్ కోరికలు సన్నగిల్లడం 
* చర్మం ముడత పడటం. 
* రక్తహీనత 
* ఎప్పుడూ పడుకునే ఉండాలనిపించడం.
 
మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే...
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారం పరిమితంగా, నియంత్రణతో తీసుకోవాలి.
 
1. కొవ్వు పదార్థాలు బాగా తగ్గించాలి.
2. మాంసాహారం, వెన్న, జున్ను తినడం తగ్గించాలి.
3. మత్తుపానీయాలు మానేయాలి.
4. తీపి పదార్థాలు అరుదుగా మాత్రమే తినాలి. వాటిలో చక్కెరలు, కొవ్వులు ఉంటాయి. 
5. తీపి పదార్థాలను విడిగా తినవద్దు. మిగిలిన ఆహారంలో భాగంగా తింటే మంచిది.
6. కొవ్వులు తక్కువుగా ఉన్న పాలనే తాగండి. మజ్జిగ తాగటం మంచిది. 
7. పలుచని పెరుగు తీసుకోవాలి.
8. తాజా కాయగూరలు తినాలి. ఉప్పు, కారం కూరలలో తక్కువ మోతాదులో వాడాలి.
9. ముదురు ఆకుపచ్చ రంగులో వుండే కూరగాయలు ఎక్కువుగా తీసుకోవాలి.
10. పండ్లరసం కాక పండ్లు, తొనలు తినాలి.
11. ఒకవేళ పండ్లరసం తీసుకుంటే అందులో చక్కెర మాత్రం వేసుకోవద్దు.
12. నిమ్మ, నారింజ, బత్తాయి వంటివి తినవచ్చు.
13. వంటకాలలో కొవ్వుల వాడకం పరిమితంగా ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెంపాబేలో కొత్త నాయకత్వాన్ని ప్రకటించిన నాట్స్