Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

murder

ఠాగూర్

, శుక్రవారం, 17 మే 2024 (14:13 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులోపడిన ఓ వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసింది. ఆ తర్వత గుండెపోటుతో మరణించినట్టుగా నమ్మించి అంత్యక్రియలు కూడా పుర్తిచేసింది. హత్య నుంచి అంత్యక్రియల వరకు తాను అనుకున్నట్టుగానే సాఫీగా జరగడంతో ఇక తనకు తిరుగులేదని భావించింది. కానీ, ఇక్కడే కథ అడ్డం తిరిగింది. తనతో కలిసి హత్యలో పాలుపచుకున్న నిందితుల్లో ఒకరు హత్య చేసిన తర్వాత మనశ్శాంతి లేకపోవడంతో పోలీసులకు లొంగిపోయాడు. జరిగినదంతా పోలీసులకు వివరించాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
హైదరాబాద్, మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ నగర్‌లోని శిఖర అపార్టుమెంట్‌లో నివసించే విజయకుమార్ (40) సీసీ కెమెరా టెక్నీషియన్. భార్య, శ్రీలక్ష్మి (33), ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మికి బోరబండకు చెందిన రాజేశ్ (33)తో జరిగిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడిని హత్యచేసేందుకు ప్రియుడితో కలిసి పథక రచన చేసింది. భర్త హత్య తర్వాత ఆయన పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఇళ్లను అమ్మేసి ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసింది. 
 
ఈ క్రమంలో వి.రామారావు నగర్‌కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి, ఎండీ మెహ్రాబ్ అలియాస్ బబ్బన్నను సంప్రదించిన రాజేశ్ సుపారీ ఇచ్చి హత్యకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన భర్తను ఇంట్లోనే హత్య చేశారు. ఆపై శవాన్ని బాత్రూంలో పడేసి గుండెపోటుకు గురై మరణించినట్టు నమ్మించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే రోజు అంత్యక్రియలు కూడా పూర్తిచేసింది.
 
హత్య చేసినప్పటి నుంచి నిందితుల్లో ఒకరైన రాజేశ్వర్ రెడ్డికి మనశ్శాంతి లేకుండా పోయింది. దీంతో మంగళవారం రాత్రి అతడు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. రాజేశ్‌ది గుండెపోటుకాదని, తామే హత్య చేశామని అంగీకరించాడు. అతడిచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేశ్, బబ్బన్లను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్