Publish Date: Wed, 16 Feb 2022 (12:30 IST)
Updated Date: Wed, 16 Feb 2022 (12:34 IST)
బ్యాంకులకు సంబంధించిన మోసాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా క్రికెట్ బెట్టింగ్ కోసం ఓ బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో తనఖా పెట్టిన బంగారాన్ని మాయం చేశాడు. ఆ మేరకు ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని మాయం చేశాడు రాజ్ కుమార్.
వన్ స్టార్ బెట్ యాప్లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ కాశాడు. కోట్ల రూపాయల బెట్టింగ్కి పాల్పడ్డ రాజ్ కుమార్ తన దగ్గర అంత మొత్తం లేకపోవడంతో బంగారాన్ని మాయం చేశాడు.
రాజ్ కుమార్ నిర్వాకంపై ఐఐఎఫ్ఎల్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీంతో రాజ్ కుమార్ను అదుపులోకి తీసుకుని ఆ బంగారాన్ని ఏం చేశాడనేది ఆరా తీస్తున్నారు.
సెల్వి
Publish Date: Wed, 16 Feb 2022 (12:30 IST)
Updated Date: Wed, 16 Feb 2022 (12:34 IST)