Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అస్సాం సీఎంపై రగడ: ప్రధాని వెంటనే బర్తరఫ్ చేయాలి

Advertiesment
Assam CM
, బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (12:01 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భువనగిరి టౌన్  పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దేశంలో ప్రజలు తల దించుకుని విధంగా  రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ తరుపున నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు.  
 
అస్సాం సీఎంకు నోటీసులు జారీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హిమంత శర్మను మోడీ వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అస్సాం సీఎంపై కోర్టులో కేసు కూడా వేస్తామన్నారు. 
 
రాహుల్ గాంధీ నాన్న, తాతలు దేశం కోసం త్యాగాలు చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పదవులు తృణ ప్రాయంగా వదులుకున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పుకొచ్చారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసిడి ధరలు పరుగులు, రూ. 51,000 దాటేసిన బంగారం