Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గిరిజన మహిళపై 12 మంది గూండాల సామూహిక అత్యాచారం

victim
, మంగళవారం, 25 జులై 2023 (11:07 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో ఓ గిరిజన మహిళపై 12 మంది గూడాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని పకూర్ జిల్లాలో వెలుగు చూసిన హేయమైన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులోని బాధిత మహిళ ఢిల్లీలో పని చేస్తుండటం గమనార్హం. ఆమె వారం క్రితంమే ఢిల్లీ నుంచి తన సొంతూరుకు వెళ్ళింది. గత ఆదివారం సాయంత్రం ప్రియుడితో కలిసి బైకుపై కూర్చొని అంపాడుకు వెళ్లింది. అక్కడ తన ప్రియుడు ఓ స్వీట్ షాపులో స్వీట్స్ కొనుగోలు చేసి, అక్కడ నుంచి ఓ ఫుట్‌‍బాల్ మైదానానికి వెళ్లారు. 
 
అక్కడ ఉన్న వున్న 12 మంది గూండాలు ఆ మహిళను నిర్బంధించి బలవంతంగా చెట్టుపక్కకు లాక్కెళ్లి వారంతా కలిసి అత్యాచారం చేసాడు. మరుసటి రోజు ఉదయం స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన తర్వాత ప్రియుడు ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయాడు. మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు జిల్లా ఎస్డీపీఓ అజిత్ కుమార్ తెలిపారు. బాధితురాలిని ప్రాథమి ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మహిళ అంజును పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు : పాక్ యువకుడు