Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాకు మందు కనిపెట్టానంటూ దాన్ని తనపైనే ప్రయోగించుకున్నాడు, మరణించాడు

Advertiesment
Corona Virus
, శుక్రవారం, 8 మే 2020 (14:35 IST)
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను నిరోధించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ను చంపేందుకు వ్యాక్సిన్ కనుగొనేందుకు ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా చెన్నైలో కరోనాను కట్టడి చేసేందుకు తను మందును కనుగొన్నానంటూ 47 ఏళ్ల శివనేసన్ అనే ఫార్మసిస్ట్ ఒకరు ఆ మందును తనపైనే ప్రయోగించుకుని ప్రాణాలు కోల్పోయాడు.  
 
ఈ ఘటన డాక్టర్ ఇంట్లో జరగడంతో, ఫార్మసిస్ట్‌తో పాటు మందులు తయారుచేయడంలో డాక్టర్ కూడా పాల్గొన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెరుంగుడి స్థానికుడైన శివనేసన్ ఉత్తరాఖండ్‌లోని ప్రొడక్షన్ మేనేజర్‌గా ప్రైవేట్ బయోటెక్ ల్యాబ్‌లో పనిచేశాడు. ఆ తర్వాత చెన్నైలో అదే కంపెనీకి చెందిన శాఖలో పనిచేస్తూ వున్నాడు.
 
గత రెండు నెలలుగా కరోనా వైరస్ పనిపట్టాలని అతడు మందును కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు చెపుతున్నారు. ఈ క్రమంలో చివరకు తను అనుకున్న మందును కనిపెట్టేశానంటూ చెన్నైలోని తేనాంపేటలోని ఒక డాక్టర్ ఇంటికి మందును తీసుకువచ్చాడు.
 
ఆ మందును డాక్టర్ రాజ్‌కుమార్ కొంత మోతాదులో సేవించగా శివనేసన్ ఎక్కువ తినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనితో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మరణించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బాలికపై ఎంఐఎం నేత అత్యాచారం!