Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలు ప్రయాణికులు స్మార్టు కార్డులను ఆన్‌లైన్‌లో రీచార్జీ చేసుకొనే వెసులుబాటు

రైలు ప్రయాణికులు స్మార్టు కార్డులను ఆన్‌లైన్‌లో రీచార్జీ చేసుకొనే వెసులుబాటు
, శుక్రవారం, 6 ఆగస్టు 2021 (21:10 IST)
భారతీయ రైల్వే డిజిటలైజేషన్‌లో భాగంగా మరో ముందడుగు వేసి ప్రజలకు మరిన్ని సౌకర్యాలు కల్పించింది. ముఖ్యంగా అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడవలసిన అవసరం లేకుండా ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్స్‌ (ఏటీవీఎమ్‌లు) ద్వారా కొనే సౌలభ్యాన్ని కలిగించింది.

స్మార్ట్‌ కార్డులు కలిగున్న రైలు వినియోగదారులు ఇకమీదట వెబ్‌ పోర్టల్‌లో యూటీఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో వారి కార్డులను రీచార్జీ చేసుకోవచ్చు. గతంలో, స్మార్ట్‌ కార్డులో డబ్బులు అయిపోతే ప్రయాణికులు వారి స్మార్ట్‌ కార్డుల రీచార్జీ కోసం ప్రతిసారీ బుకింగ్‌ కౌంటర్లకు రావలసి వచ్చేది. రైలు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు వారు డిజిటల్‌ పద్ధతిలో స్మార్టు కార్డులను రీచార్జీ చేసుకునే వసతిని భారతీయ రైల్వే కల్పించింది. దీంతో ప్రయాణికులు బుకింగ్‌ కౌంటర్ల వద్ద క్యూలలో నుంచోవలసిన అవసరం ఉండదు, ముఖ్యంగా కోవిడ్‌ సమయంలో బుకింగ్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికుల రద్దీని నివారించవచ్చు.
 
రైలు వినియోగదారులు క్రింద తెలిపిన పద్ధతిలో ఈ సౌకర్యాన్ని పొందవచ్చు :
 రైల్వే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. `మెనూలో ‘‘స్మార్ట్‌ కార్డు రీచార్జీ’’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
` డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వంటి అన్ని డిజిటల్‌ విధానాల ద్వారా చెల్లింపు చేయవచ్చు. ` చెల్లింపైనట్లు నిర్ధారించిన తర్వాత, అకౌంట్‌లో డబ్బులు మినహాయించిన తర్వాత, ప్రయాణికులు సంబంధిత జోన్‌లోని ఏటీవీఎమ్‌ను 15 రోజులలో సందర్శించాలి. ఈ లోపు కార్డు గడువు ముగిసినట్లయితే గడువు లోపల ఏటీవీఎమ్‌ను సందర్శించాలి.
 
`ప్రయాణికులు ఏటీవీఎమ్‌ రీడర్‌ వద్ద స్మార్టు కార్డులను పెట్టి ‘‘రీచార్జి స్మార్ట్‌ కార్డు’’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తర్వాత ఏటీవీఎమ్‌లో ఆన్‌లైన్‌ రీచార్జీ వివరాలు వస్తాయి. తదనుగుణంగా ఏటీవీఎమ్‌ స్మార్టు కార్డు రీచార్జీ చేయబడుతుంది. `దీంతో టికెట్‌ కొనుగోలుకు స్మార్ట్‌ కార్డును సంబంధిత రైల్వే జోన్‌లోని ఏదేనీ ఏటీవీఎమ్‌లో వినియోగించుకోవచ్చు.
 
కౌంటర్ల వద్ద భారీ క్యూ లైన్లను నివారించాలనే లక్ష్యంతో యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌, ఆటోమెటిక్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్లు (ఏటీవీఎమ్‌లు) మరియు కరెన్సీ ఆపరేటడ్‌ టికెట్‌ వెండిరగ్‌ మెషిన్లు (సీఓటీవీఎమ్‌లు) వంటి అనేక డిజిటల్‌ పద్ధతులను ప్రవేశ పెట్టింది.

ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్లను మరియు ప్లాట్‌ఫారం టికెట్లను రైల్వే స్మార్ట్‌ కార్డుల ద్వారా పొందితే కౌంటర్ల వద్ద క్యూలైన్లలో నిలబడవలసిన అవసరం ఉండదు. మొట్టమొదటిసారి స్మార్టు కార్డు పొందడానికి చిరునామా రుజువు మరియు ఇతర అవసరమైన వివరాలను అందజేయవలసి ఉంటుంది. అనంతరం, ప్రయాణికులు టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌ కార్డు రీచార్జీ చేసుకోవాలి.
 
నేటి కోవిడ్‌ మహమ్మారి కాల పరిస్థితులలో ఆన్‌లైన్‌ రీచార్జీ సౌకర్యం ఎంతో స్వాగతించాల్సిన అంశం అని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య అన్నారు. ఇది ప్రయాణికుల విలువైన సమయాన్ని ఆదా చేస్తుందని అన్నారు. ఈ ఆన్‌లైన్‌ సౌలభ్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని, దీంతో వారు ప్రతిసారి యూటీఎస్‌ కౌంటర్ల వద్దకు రావాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖకు నిర్మలా సీతారామన్: స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని..?