Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్త్రీలలో నడుము నొప్పి.. తొలగిపోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి..

స్త్రీలలో నడుము నొప్పి.. తొలగిపోవాలంటే.. ఈ టిప్స్ పాటించండి..
, శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (11:36 IST)
స్త్రీలలో నడుము నొప్పి సమస్య చాలా మందికి ఉంటుంది. నడుము పట్టేయడం, వెన్నునొప్పితో బాధపడుతుంటారు. ఆ భాగంలోని కండరాలు, ఎముకలు బలహీనపడటం ఒక కారణమయితే, గర్భధారణ, ప్రసవం, గర్భాశయంలో సమస్యలు, ఫైబ్రాయిడ్లు మరికొన్ని కారణాలు. ఈ సమస్యల నుండి బయటపడటానికి ఆయుర్వేదంలో చికిత్స ఉంది. 
 
పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కడుపులో గ్యాస్‌ను పెంచే సెనగలు, మసాలా పదార్థాల వంటి వాటిని దూరం పెట్టాలి. కూర్చునే, నిల్చునే భంగిమ చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు వంగినట్లు కూర్చోకూడదు. ఒక కప్పు నువ్వుల నూనెలో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్‌ను కలుపుకుని నడుముకు రాసుకుంటే నొప్పి తగ్గుతుంది. 
 
శొంఠి కషాయంలో కొద్దిగా ఆముదం కలుపుకుని నడుముకు రాసుకుంటే కూడా నడుము నొప్పి తగ్గుతుంది. కప్పు నీళ్లలో కొద్దిగా మిరియాలు, లవంగాలు, శొంఠి పొడి వేసుకుని టీలా కాచుకోవాలి. ఈ టీను ప్రతిరోజూ నడుముకు రాసుకోవడం వలన నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనెను కలుపుకుని రోజుకు రెండు మార్లు నడుముకు రాసుకోవాలి. కొబ్బరి నూనెను వేడిచేసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి కరిగించాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నడుముకు మర్దనా చేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త.. యాపిల్ తిని కుర్చీకే పరిమితమైన చిన్నారి?