Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాస్తు: ఇల్లు శుభ్రంతో పురోగతి.. టాయ్‌లెట్‌ను అలా వదిలేయకండి..

Vastu
, బుధవారం, 3 ఆగస్టు 2022 (22:30 IST)
ఇంటిని శుభ్రంగా వుంచుకోవడం ద్వారా వాస్తు దోషాలు ఇట్టే తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మహిళలు ముఖ్యంగా సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి తరువాత చీపురుతో ఊడ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఇల్లు చిమ్మడం ద్వారా ఆర్థిక పురోగతి వుండదు. అది సంపదపై ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది. 
 
ఇల్లు శుభ్రంగా ఉండడం వల్ల మన మనస్సు, శరీరం, ఆరోగ్యంతో పాటు మన పురోగతి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇక రాత్రిపూట పొరపాటున కూడా చీపురుతో ఇల్లు చిమ్మకూడదు. అలా చేస్తే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
 
ఇంట్లోని టాయిలెట్‌లను కూడా ప్రత్యేకంగా శుభ్రంగా ఉంచుకోవాలి. బాత్రూంలను అశుభ్రంగా ఉంచడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. ఒక బాత్రూమ్‌లను ఎప్పుడూ బూజు పట్టకుండా చూసుకోవాలి. 
 
బాత్రూమ్-టాయిలెట్ కారణంగా ఏదైనా వాస్తు దోషం ఉంటే, అప్పుడు ఉప్పు నింపిన గిన్నెను ఒక మూలలో ఉంచితే దోషాలు తొలగిపోతాయి. అంతే కాకుండా బాత్‌రూమ్‌లో చెత్త పేరుకుపోకుండా చూడాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కంధ షష్ఠి ఆరాధనతో నాగదోషాలు మటాప్.. నేతి దీపం చాలు..