లివ్ ఇన్ రిలేషన్ సాగిస్తూ సమాజంలో పూర్తిస్థాయి ఎంజాయ్ చేస్తున్న జంటల్లో దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి వున్నారని ప్రస్తుతం వైరల్ అవుతున్న వారి డ్యాన్స్ వీడియోను చూసి చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఏమాటకామాట... దువ్వాడ శ్రీనివాస్ కాస్త ఇలాగే డ్యాన్స్ చేస్తూ పోతే సినీ ఇండస్ట్రీలో సూపర్ డ్యాన్సులేసేవారు కూడా ఆయన ముందు ఓడిపోతారంటున్నారు. అంతెందుకు.. దువ్వాడ-దివ్వెల ఇద్దరూ అలా స్టేజి పైన డ్యాన్సు చేస్తుంటే ఎదురుగా వారి డ్యాన్స్ చూస్తున్నవారు కుర్చీల్లో కూర్చోలేకపోయారట. వారి స్టెప్పులకు ఊగిపోతూ కేరింతలు కొడుతూ ఓ దశలో స్టేజి పైకి ఎక్కి వారితో కలిసి కాళ్లు కదుపుదాము అనుకున్నారట. ఐతే నిబంధనలు వర్తిస్తాయి కాబట్టి కుర్చీల్లోనే పిసుక్కుంటూ కూర్చున్నారట.
ఇక నెటిజన్ల కామెంట్లు మామూలుగా లేవు. సోషల్ మీడియా బద్ధలయిపోతోంది. ఏదేమైనా వైసిపి ఓడిపోయాక ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు జైళ్లలోనూ, ఇంకొందరు అజ్ఞాతంలోనూ, మరికొందరు రోగాలుతో సతమతం అవుతుంటే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం రా అంటూ దూసుకు వెళ్తున్నారని కామెంట్లు కొడుతున్నారు. ఇంకొందరైతే... హాయిగా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న ఆ జంటను చూసి, వాళ్ల డ్యాన్సును చూసి ఏడుస్తారెందుకు అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తమ్మీద దువ్వాడ-దివ్వెల డ్యాన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపుతోంది.