Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిడ్డ శవాన్ని పది కిలో మీటర్ల మేర భుజాలపై మోసిన తండ్రి.. ఎక్కడ?

బిడ్డ శవాన్ని పది కిలో మీటర్ల మేర భుజాలపై మోసిన తండ్రి.. ఎక్కడ?
, శనివారం, 26 మార్చి 2022 (19:12 IST)
Roypur
శవాలను తరలించే వాహనం అందుబాటులోకి లేకపోవడంతో తన బిడ్డ శవాన్ని పది కిలో మీటర్ల మేర భుజాలపై మోసుకెళ్లాడు. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దియో స్పందించి, విచారణకు ఆదేశించారు.
 
వివరాల్లోకి వెళ్తే.. అమ్‌దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్‌కు సురేఖ(7) అనే కూతురు ఉంది. సురేఖ గత నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ ఆక్సిజన్ లెవల్స్ పూర్తిగా పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయింది. 
 
అయితే శవాలను తరలించే వాహనం అందుబాటులో లేకపోవడంతో, చేసేదేమీ లేక ఈశ్వర్ తన భుజాలపైనే బిడ్డ శవాన్ని 10 కిలోమీటర్ల మేర నడక సాగించి, స్వగ్రామానికి చేరుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ దియో స్పందించి, విచారణకు ఆదేశించారు.
 
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాకుళంలో దారుణ ఘటన: గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో..?