Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్లమెంట్ సమావేశాలు : మోడీ భరతం పట్టండి.. ఎంపీలతో చంద్రబాబు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ భరతం పట్టాలంటూ సొంత పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

పార్లమెంట్ సమావేశాలు : మోడీ భరతం పట్టండి.. ఎంపీలతో చంద్రబాబు
, బుధవారం, 18 జులై 2018 (10:17 IST)
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ భరతం పట్టాలంటూ సొంత పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
 
ముఖ్యంగా, పార్లమెంట్ తలుపులను మూసేసి ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని గతంలో ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోడీ, జరిగిన అన్యాయాన్ని ఎందుకు సరిదిద్దడం లేదని నిలదీయాలంటూ ఎంపీలను కోరారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌లో ఎంపీలతో చంద్రబాబు మాట్లాడి దిశానిర్దేశం చేశారు. 
 
ఒక లక్ష్యం కోసం మనం పోరాటం చేస్తున్నామని ఎంపీలతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళదామని అన్నారు. సభలో సస్పెండ్ చేసినా వెనుకాడవద్దని, ఏ పరిణామానికైనా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అవిశ్వాస తీర్మానంపై వివిధ పార్టీల ప్రతినిధులను కలసి మద్దతు కోరిన ఎంపీలను ప్రత్యేకంగా అభినందించిన చంద్రబాబు, సభలో ప్రధానిని నిలదీయాలని అన్నారు. అన్యాయం జరిగిందన్న ఆయనే ఎందుకు చక్కదిద్దలేదో అడగాలని, తాను ఎప్పటికప్పుడు ఢిల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటానని చంద్రబాబు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాహూ మెసెంజర్ సేవలు నిలిపివేత