Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అపుడు కాంగ్రెస్.. ఇపుడు బీజేపీ.. నీవు ఎన్టీఆర్ బిడ్డవమ్మా : పురంధేశ్వరికి గుడివాడ వాసి షాక్

స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కర్ణాటక రాష్ట్రంలో ఓటరుగా ఉన్న గుడివాస వాసి తేరుకోలేని షాకిచ్చారు. రాయచూరు జిల్లాలో బీజేపీ తరపున ప్రచారం చేసేందు

అపుడు కాంగ్రెస్.. ఇపుడు బీజేపీ.. నీవు ఎన్టీఆర్ బిడ్డవమ్మా : పురంధేశ్వరికి గుడివాడ వాసి షాక్
, గురువారం, 3 మే 2018 (13:52 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కర్ణాటక రాష్ట్రంలో ఓటరుగా ఉన్న గుడివాస వాసి తేరుకోలేని షాకిచ్చారు. రాయచూరు జిల్లాలో బీజేపీ తరపున ప్రచారం చేసేందుకు వెళ్లిన పురంధేశ్వరికి ఈ తెలుగు రైతు తేరుకోలేని ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేశాడు.
 
ఇంతకీ పురందేశ్వరిని ఆయన ఏమడిగారంటే...'అమ్మా, క్రితంసారి జరిగిన ఎన్నికల్లో కూడా నువ్వు ఇక్కడకు వచ్చి ప్రచారం చేశావ్. అప్పడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నావ్. ఇప్పుడు వచ్చి, బీజేపీకి ఓటేయమంటున్నావ్. ఏపీకి అన్యాయం చేసిన పార్టీలతోనే ఎప్పుడూ ఎందుకుంటున్నావమ్మా?.. నీవు ఎన్టీఆర్ బిడ్డవమ్మా' అంటూ నిలదీశారు. 
 
అంతేనా... 'మీ స్థానంలో వేరొకరు ఉంటే అడిగేవాడ్ని కాదమ్మా. మాది గుడివాడ తాలూకా. మీ నాన్నగారు టీడీపీ స్థాపించినప్పుడు, పార్టీ జెండా మోశా. ఆ అభిమానంతోనే అడుగుతున్నా' అంటూ తన ప్రశ్న ముగించాడు. ఈ ప్రశ్నకు ఆమె షాక్‌కు గురైంది. ఆ తర్వాత తేరుకుని రాష్ట్రాలని బట్టే పరిస్థితులు మారతాయని, న్యాయం చేసే పార్టీలకే ఓటు వేయమని చెబుతున్నానని, తనది రాజకీయం కాదని చెప్పి అక్కడ నుంచి ఆమె చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. మొత్తంమీద కర్ణాటకలో తెలుగు ఓటర్లు బీజేపీతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయం తేటతెల్లమవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు : ఇకపై వీడియో కాలింగ్ ఆప్షన్