Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ కల్లిబొల్లి మాటలు కడుపు నింపవు : సోనియా గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారంతో ప్రజల కడపు నిండదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో

మోడీ కల్లిబొల్లి మాటలు కడుపు నింపవు : సోనియా గాంధీ
, బుధవారం, 9 మే 2018 (10:35 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారంతో ప్రజల కడపు నిండదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
ఈ ప్రచారంలో భాగంగా, విజయపురలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో కరువు పరిస్థితిపై మోడీని సీఎం సిద్ధరామయ్య కలవాలనుకుంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. కర్ణాటకను దేశంలో నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని ఆమె గుర్తుచేశారు. మోడీ గొప్ప వక్త అన్న సోనియా… ఆయన మాటలు దేశంలో ఎవరి కడుపు నింపబోవన్నారు. 
 
అంతకుముందు మోడీ కూడా విజయపుర జిల్లాలోనే ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కొప్పాల్‌లోనూ ప్రచారం చేశారు. కన్నడ రైతుల ఘోష కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడంలేదని మోడీ ఆరోపించారు. పంటకు అయ్యే ఖర్చుపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇచ్చేలా… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు నిస్సహాయ స్థితిలో వున్నారు.. పవన్ జాగ్రత్తగా వుండాలి: పవన్