Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో తొలిసారి సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్

vaccine
, గురువారం, 1 సెప్టెంబరు 2022 (09:54 IST)
దేశంలో తొలిసారి సర్వైకల్ క్యాన్సర్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని సర్వైకల్  కేన్సర్‌తో బాధపడే రోగులకు సెప్టెంబరు ఒకటో తేదీ గురువారం నుంచి వేయనున్నారు. ఈ వ్యాక్సిన్ వివరాలను పరిశీలిస్తే,
 
మన దేశంలో క్వాడ్రివాలెంట్ హ్యూమ్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ సర్వైకల్ కేన్సర్‌పై బాగా పని చేస్తుందని వివిధ దశల్లో నిర్వహించిన ప్రయోగాల్లో తేలింది. దేశంలోని యువతకు, అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల 30 యేళ్ల తర్వాత ఎదురయ్యే సర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. 
 
ప్రపంచ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన కొరత ఉంది. ఇపుడు మన దేశంలో ఈ వ్యాక్సిన్ తయారు చేయడం ఎంతో శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది దేశ అవసరాలను తీర్చుతుందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా తెలిపారు. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఒక్క భారత్‌లోనే 2019 ప్రకారం దాదాపు 42 లక్షల మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
 
సర్వైకల్ కేన్సర్ అంటే... 
సెర్విక్స్‌లో ప్రారంభమయ్యే కేన్సర్ కావడంతో దీన్ని సర్వైకల్ కేన్సర్ అని పిలుస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం మహిళల్లో చాలా మంది సర్వైకల్ కేన్సర్ ముప్పులో ఉన్నారని తెలుస్తోంది. 30 యేళ్ల దాటిన ప్రతి మహిళకు ఈ సర్వైకల్ కేన్సర్ సోకే ప్రమాదం ఉంది. దీర్ఘకాలం ఇన్ఫెక్షన్ కలిగించే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ కేన్సర్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. ఈ తరహా కేన్సర్‌ను త్వరగా గుర్తించగలిగితే మనిషి జీవన ప్రమాణాల్ని పెంచడం సాధ్యపడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలైలో రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్లు...