Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్

దంతం కోసం ఏనుగును ఇలా చంపేశారు.. డ్రోన్ తీసిన ఫోటో వైరల్
, సోమవారం, 22 జులై 2019 (14:42 IST)
బోట్సువానా దంతం కోసం ఏనుగును దారుణంగా చంపేసిన ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఓ డ్రోన్ తన కెమెరాలో బంధించింది. ఈ దారుణమైన ఫోటోకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో భారీగా షేర్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని బొట్సువానాలోని వేటకు నిషిద్ధమైన ప్రాంతానికి సమీపంలో.. దంతం కోసం ఏనుగును దారుణంగా చంపేశారు.

దంతాల కోసం ఏనుగులను హతమార్చడం పెరిగిపోతున్న తరుణంలో దీన్ని నిరోధించేందుకు ఓ ప్రైవేట్ సంస్థకు ఆధారంగా ఓ ఫోటోను పంపేందుకు ఐస్టీన్ అనే వ్యక్తి.. బోట్సువానా ప్రాంతంలో తన డ్రోన్‌ను ఎగిరేలా చేశాడు. 
 
ఆ డ్రోన్ సాయంగా దంతం కోసం దారుణం ఏనుగు చంపేసిన ఫోటో కెమెరాకు చిక్కింది. ఏనుగు తలను నరికి.. దంతాన్ని రంపంతో కోసిన దృశ్యాలు డ్రోన్‌కు చిక్కాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దంతం కోసం మూగ జీవులను ఇలా హత్య చేయడంపై పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో చేరాతనాన్ని రాయపాటి.. ఆషాఢ మాసంలో వద్దన్న కన్నా!