Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)

పిల్ల ఏనుగు చనిపోతే.. తల్లి ఏనుగుతో పాటు ఏనుగుల గుంపు ఏం చేసిందంటే? (వీడియో)
, మంగళవారం, 11 జూన్ 2019 (11:29 IST)
మనచుట్టూ తిరుగుతున్న ఓ వ్యక్తి చనిపోతే.. ఎంతటి బాధ మనుషులకు వుంటుందో.. అదే బాధ మూగ జీవాలను వుంటుంది. బాధకు తాము అతీతులమని కాదని.. తమలోనూ భావోద్వేగాలు వుంటాయని.. తాజాగా ఈ ఏనుగులు నిరూపించాయి. 
 
ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే, దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది. ఈలోగా, అక్కడికి వచ్చిన మిగతా ఏనుగులు, సంతాప సూచకంగా ఓ నిమిషం పాటు మౌనంగా నిలబడిపోయాయి. ఇంకా తల్లి ఏనుగు.. పిల్ల ఏనుగు మృతదేహాన్ని.. అడవిలోకి తీసుకెళ్లింది. 
 
పర్వీన్ అనే అటవీ అధికారి మొత్తం వీడియోను తీసి, ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందులో మూడు గున్న ఏనుగులున్నాయి.

ఏనుగుల బృందం అలా పిల్ల ఏనుగును తీసుకెళ్తున్న దృశ్యాన్ని చాలామంది ప్రజలు కూడా వీక్షించారు. తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైకేల్ జాన్సన్‌ను తలపించే డ్యాన్స్.. మైట్రో కార్మికుడి అదిరే డ్యాన్స్ (వీడియో)