Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలకు కరోనా సోకడం మంచిదే : ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

పిల్లలకు కరోనా సోకడం మంచిదే : ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా
, మంగళవారం, 20 జులై 2021 (09:46 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అధిపతి రణ్‌దేప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ముఖ్యంగా, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తున్నాయి. అయితే, రణ్‌దీప్ గులేరియా మాత్రం పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని అంటున్నారు. దీనివల్ల చాలామంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులను బేరీజువేసి దశలవారీగా విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని, స్కూల్స్ మూసివేత పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. కేసులు తక్కువగా ఉన్న జిల్లాలలో స్కూల్స్ తెరువవచ్చని కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలలో ఓపెన్ చేయటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
 
అదేసమయంలో ఒక వేళ కరోనా కేసులు పెరిగిన పక్షంలో స్కూల్స్‌ను మూసివేయడం, రోజు విడిచి రోజు స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం వంటి పద్ధతులను పాటించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి స్కూళ్లలో ఉండాలన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్