Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్న భక్తుడు.. ఎలా సాధ్యం..?

Advertiesment
శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయంలోకి వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్న భక్తుడు.. ఎలా సాధ్యం..?
, మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (19:00 IST)
తిరుమల శ్రీవారి ఆలయం అంటేనే ఎంతో భద్రత. అందులోను నిషేధిత వస్తువులు తీసుకెళ్ళకుండా టిటిడి విజిలెన్స్, నిఘాతో పాటు పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. అలాంటి తిరుమలలో ఏకంగా ఒక తమిళ భక్తుడు జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఫోటోతో ఆలయంలోకి వెళ్ళిపోయాడు. అది కూడా పార్టీ కండువాకు ఆలయానికి వెళ్ళి దర్సనం చేసుకున్నాడు. 
 
కడలూరుకు చెందిన ఆరూల్ జ్యోతి అనే భక్తుడు పార్టీ కండువా, శశికళ ఫోటోతో శ్రీవారి ఆలయ ప్రవేశ చేయడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. అది కూడా శశికళ జైలు నుంచి బయటకు రావాలని, ఆమె సిఎం కావాలంటూ మ్రొక్కులు తీర్చుకున్నట్లు ఆలయం బయటకు వచ్చిన ఆ భక్తుడు మీడియాకు చెప్పాడు. దీంతో మీడియా ప్రతినిధులే అవాక్కయ్యారు.
 
తమిళ భక్తుడిని వెంటనే టిటిడి విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భక్తుడు పార్టీ కండువా, ఫోటోలతో ఎలా లోపలికి ప్రవేశించాడన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. టిటిడి ఉన్నతాధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉచిత వైఫైలో గూగుల్ వెనక్కి.. అయినా పర్లేదన్న రైల్ టెల్ (video)