Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పక్కన కూర్చున్న భట్టి.. రాహుల్ గాంధీ దోసెను తింటున్న కోమటి రెడ్డి

Advertiesment
Rahul Gandhi

సెల్వి

, సోమవారం, 11 మార్చి 2024 (22:58 IST)
Rahul Gandhi
యాదగిరిగుట్టలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానించారని బీఆర్ఎస్ నాయకులు చేస్తోన్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందిస్తోంది. సోషల్ మీడియాలో యాదగిరిగుట్టను ట్రోల్ చేస్తుండటంతో కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ భట్టివిక్రమార్క పైన కూర్చొని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కింద కూర్చున్న ఫొటోను షేర్ చేసింది. 
 
బీఆర్ఎస్ నాయకులకు రెండు ఫొటోలు పోస్ట్ చేసి కౌంటర్ ఇచ్చింది. అందులో ఓ ఫొటోలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్కలు పక్క పక్కన కుర్చీల్లో కూర్చొని ఉండగా... కోమటిరెడ్డి వెంకట రెడ్డి కింద కాళ్లపై కూర్చొని రాహుల్ గాంధీ చేతిలోని దోసెను ఆరగిస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం అని ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మరో ట్వీట్‌లో రేవంత్ రెడ్డి కాలుమీద కాలు వేసుకొని ఉండగా, మల్లు భట్టి విక్రమార్క మీసాలు దువ్వుతున్నట్లుగా ఉన్న ఫొటోను షేర్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై రాజ్యలక్ష్మి వైద్య కాలేజీ హాస్పిటల్ ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం..