Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమాజం పాలిట బీజేపీ ప్రమాదకరంగా మారుతోంది : ప్రకాష్ రాజ్

భారతీయ జనతా పార్టీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కత్తికట్టినట్టున్నారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన కన్నడ ఓటర్లకు పిలుపునిచ్చారు.

సమాజం పాలిట బీజేపీ ప్రమాదకరంగా మారుతోంది : ప్రకాష్ రాజ్
, గురువారం, 10 మే 2018 (09:06 IST)
భారతీయ జనతా పార్టీపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ కత్తికట్టినట్టున్నారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని ఆయన కన్నడ ఓటర్లకు పిలుపునిచ్చారు. అదేసమయంలో తాను ఫలానా పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరడం లేదనీ, కేవలం బీజేపీని ఓడించాలని మాత్రమే కోరుతున్నట్టు చెప్పారు.
 
అలా ఎందుకు పిలుపునిస్తున్నానో కూడా ఆయన వివరణ ఇచ్చారు. బీజేపీ సమాజం పాలిట ప్రమాదకరంగా తయారవుతోంది. ఒక కులం, ఒక మతం మాత్రమే దేశాన్ని ఏలాలనే సిద్ధాంతంతో పనిచేస్తోంది. అధికారంలోకి రావడానికి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది. నేను హిందూయిజానికి వ్యతిరేకిని కాదు. కానీ, బీజేపీ చేష్టలతో హిందూయిజానికి ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాను అని వివరించారు. 
 
ఇదే పంథాను కొనసాగిస్తా.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా. మోడీ నుంచి దేశాన్ని కాపాడేందుకు నాలాంటి చౌకీదార్లు ఎందరో తయారవుతున్నారు. వారిని ఏకతాటిపైకి తీసుకొస్తా. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో నా బాటలో 3 వేల మంది తయారయ్యారు. మాస్‌, క్లాస్‌ అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని వెళ్తున్నా. మాస్‌ గల్లీలో ప్రచారం చేస్తే.. క్లాస్‌ సోషల్‌ మీడియాలో చేస్తున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో రైతు బంధు పథకం... పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్ నేత‌లు..!