Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరెడ్డి చెప్తున్న ఆ 12 మంది మగాళ్లు ఎవరు? మిగిలినవారు మంచోళ్లేనట...

తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి గురించి చెప్పే క్రమంలో గబుక్కున నోరు జారి మాట్లాడాననీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన 90 శాతం మంది లుచ్ఛాలు బ్రోకర్లంటూ చేసిన వ్యాఖ్యలపై తను పశ్చాత్తాప పడుతున్నట్లు నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. గతంలో తన పట్ల కొంత

శ్రీరెడ్డి చెప్తున్న ఆ 12 మంది మగాళ్లు ఎవరు? మిగిలినవారు మంచోళ్లేనట...
, సోమవారం, 26 మార్చి 2018 (19:55 IST)
తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారి గురించి చెప్పే క్రమంలో గబుక్కున నోరు జారి మాట్లాడాననీ, సినిమా ఇండస్ట్రీకి చెందిన 90 శాతం మంది లుచ్ఛాలు బ్రోకర్లంటూ చేసిన వ్యాఖ్యలపై తను పశ్చాత్తాప పడుతున్నట్లు నటి శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పింది. గతంలో తన పట్ల కొంతమంది ప్రవర్తించిన తీరును తలుచుకున్నప్పుడు గబుక్కున అలా మాట్లాడేసినట్లు చెప్పుకొచ్చింది. 
 
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గత కొన్ని రోజులగా శ్రీరెడ్డి వరుసబెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి విమర్శనస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలువురు వర్థమాన నటీమణులు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సత్య అనే నటి శ్రీరెడ్డిని చెప్పుతో కొడతానంటూ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ వ్యాఖ్యానించింది. 
 
తాజాగా మరో నటి జ్యోతితో ముఖాముఖిగా మాట్లాడుతూ... ఆమె అడిగిన ప్రశ్నలకు గిజగిజలాడిపోయింది. మగాళ్లను లుంగీల్లో చూడటం చాలా ఇష్టం అని అన్నావు... ఎందుకని అని జ్యోతి అడగ్గానే... గోదావరి వాళ్లు లుంగీలేసుకుంటారు.. అదే చెప్పానంటూ సర్దుకుంది శ్రీరెడ్డి. ఆ తర్వాత మాట్లాడుతూ... నీ వరుస చూస్తుంటే నాతో పేర్లు చెప్పించేటట్లు వున్నావే.. నా వద్ద 12 మంది పేర్లున్నాయంటూ వ్యాఖ్యానించింది. దాంతో జ్యోతి అందుకుని ఆ 12 మంది పేర్లు సినీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లొచ్చు కదా... మీడియాకు ఎక్కి అందరూ అలాంటివారే అని ఎందుకు చెప్తున్నావ్ అంటూ గట్టిగా నిలదీసింది. దీనితో శ్రీరెడ్డి దారికి వచ్చేసినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బామ్ డిగ్గీ డిగ్గీ పాటకు బామ్మతో ఆదాశర్మ స్టెప్పులు (వీడియో)