Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాహ్నవి దాసెట్టికి కరోనా? మహాతల్లి ఏం చెప్పిందంటే?

జాహ్నవి దాసెట్టికి కరోనా? మహాతల్లి ఏం చెప్పిందంటే?
, శుక్రవారం, 27 నవంబరు 2020 (22:27 IST)
Mahathalli
తెలుగు యూట్యూబ్ స్టార్ జాహ్నవి దాసెట్టి. ఈమె మహాతల్లి పేరుతో ఈమెకు యూట్యూబ్‌లో ఓ ఛానల్ ఉంది. అక్కడ జాహ్నవి ఛానల్‌కు పది లక్షల మంది సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఈమె చేసే వీడియోలకు మంచి వ్యూసే దక్కుతున్నాయి. 
 
తాజాగా ఈమెకు గత కొన్ని రోజులుగా దగ్గు, జలుబుతో బాధ పడుతోంది. దీంతో ఎందుకైనా మంచిదని డాక్టర్లను సంప్రదించింది. వారి సలహాతో కరోనా పరీక్షలు చేయించుంది. ఈ టెస్టుల్లో ఆమెకు కరోనా నెగిటివ్ అని తేలింది. దీంతో మహాతల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఊపరి పీల్చుకున్నారు.
 
కానీ ఈమెకు కరోనా పాజిటివ్ అని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో నిజం లేదని జాహ్నవి చెప్పింది. వైద్యులు కూడా సాధారణ జలుబేనని చెప్పారు. అలాగని అశ్రద్ధగా ఉండకుండా.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారని తెలిపింది.
 
జాహ్నవి మహత్తల్లి అనే ఛానల్‌ను 11 మార్చి 2016 న ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఛానెల్‌కు 1.78 మిలియన్ పైగా సబ్‌స్కైబర్స్ ఉన్నారు. ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. జాహ్నవి 7 సెప్టెంబర్ 1991లో జన్మించింది. ఆమె తండ్రి న్యాయవాది, తల్లి ప్రిన్సిపాల్. జాహ్నవి తన ప్రియుడు జూలై 1, 2018 న సుశాంత్ రెడ్డిని వివాహం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘనంగా ప్రారంభమైన రెడ్డీస్ మల్టీప్లెక్స్