Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాలీవుడ్‌లో మరో విషాదం: బట్టలు ఆరేస్తుండగా జారిపడి దర్శకుడు మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం: బట్టలు ఆరేస్తుండగా జారిపడి దర్శకుడు మృతి
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (07:51 IST)
టాలీవుడ్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. దర్శకుడు పైడి రమేష్ మృతిచెందారు. బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కృష్ణానగర్ ఎలెన్ నగర్‌లో ఓ భవనం పై నుంచి జారిపడి ఆయన కన్నుమూశారు.
 
భవనం నాలుగో అంతస్తులో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షాక్ కొట్టడంతో.. ఆయన ప్రమాదవశాత్తు జారిపడినట్టుగా చెప్తున్నారు.
 
నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు పైడి రమేష్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
కాగా, పైడి రమేష్ దర్శకత్వంలో 'రూల్‌' అనే సినిమా తెరకెక్కింది. 2018లో విడుదలైన ఈ సినిమా అంతగా నడవకపోయినా.. మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్న ఈ యంగ్‌ డైరెక్టర్‌ ఇలా మృతిచెందడం.. టాలీవుడ్‌లో విషాదాన్ని నింపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మే 1న ఘనంగా ఫిలిం ఫెడరేషన్ కార్మిక దినోత్సవ సంబరాలు