Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేనాటి వీరుడి కథ "సైరా".. దుమ్మురేపుతున్న మెగాస్టార్

Advertiesment
Sye Raa Trailer
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. రేనాటి వీరుడి జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ యువ హీరో రాం చరణ్ నిర్మించగా, ఇందులో అమితాబ్, నయనతార, జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుధీప్ వంటి భారీ తారాగణం నటించింది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అక్టోబరు రెండో తేదీన విడుదలకానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం సాయంత్రం విడుదల చేశారు. 
 
ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్‌తో ఈ సినిమా నుంచి ఒక టీజర్‌ను రిలీజ్ చేయగా, దానికి అనూహ్యమైన స్పందన వచ్చింది. 'రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరూ చెప్పిన డైలాగ్ టీజర్లో హైలైట్ అయింది.
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి తిరుగుబాటు.. నరసింహారెడ్డి ఆచూకీ కోసం ఆంగ్లేయులు అక్కడి ప్రజలను హింసించడం ఈ ట్రైలరులో చూపించారు. 
 
'స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు.. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా.. నా దేశం వదిలి వెళ్లిపోండి.. లేదా.. యుద్ధమే' అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది. ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రానాకి షాక్ ఇచ్చిన కీర్తి సురేష్‌... ఇంత‌కీ ఏం చేసింది..?