Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చందమామపై స్థలం కొన్న ఏకైక నటుడు.. ఎవరో తెలుసా?

Advertiesment
చందమామపై స్థలం కొన్న ఏకైక నటుడు.. ఎవరో తెలుసా?
, బుధవారం, 17 జూన్ 2020 (12:43 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి పట్ల దేశ సినీ ప్రపంచమంతా దిగ్భ్రాంతికి గురైంది. అతని వ్యక్తిత్వం గురించి గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే..? ఏ హీరోకు లేని స్పెషాలిటీ సుశాంత్ సింగ్‌కు ఉంది.

చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే ఎక్కువగా ఇష్టపడే సుశాంత్‌ సింగ్.. చందమామపై స్థలం కొన్నాడు. అక్కడ స్థలం కొన్న ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావడం విశేషం. 
 
ఒక సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే.. ఎక్కువగా అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ఇక చందమామాపై సుశాంత్ కొన్న ఈ స్థలాన్ని లూనార్ లాండ్ రిజిస్ట్రీ నుంచి కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్లే చందమామపై స్థలాలను విక్రయిస్తున్నారు. 
 
అంతకుముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఓ అభిమాని చందమామపై స్థలం కొని ఆయకు బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాంటిది.. చందమామపై స్థలం కొన్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆస్తుల విలువ రూ. 60 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా పాటల ఆల్బమ్‌ను ఆవిష్కరించిన వి.వి. వినాయక్