Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది సుశాంత్... : సంజయ్ నిరుపమ్

బాలీవుడ్ ఇండస్ట్రీ చాలా క్రూరమైనది సుశాంత్... : సంజయ్ నిరుపమ్
, మంగళవారం, 16 జూన్ 2020 (19:22 IST)
బాలీవుడ్ యువనటుడు, ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‍పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబై, బాంద్రాలోని తన నివాసంలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మరణవార్త తెలియగానే బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 
 
అయితే, ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. "నిన్ను దారుణంగా హింసించిన వారి గురించి నాకు బాగా తెలుసు" అంటూ సుశాంత్‌ను ఉద్దేశించి డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆవేదనాభరితంగా చేసిన ట్వీట్ చేశారు. 
 
ఇదే క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీలోని చీకటి కోణాలను బయటపెడుతున్నారు. సుశాంత్ మరణంపై రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ కూడా సంచలన ఆరోపణలు చేశారు. 2019లో 'చిచోరే' సినిమా హిట్ అయిన తర్వాత సుశాంత్ సింగ్ ఆరు సినిమాలకు సైన్ చేశాడని... అయితే కావాలనే ఆ సినిమాల నుంచి సుశాంత్‌ను తప్పించేశారని చెప్పారు. 
 
దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. హిందీ సినీ పరిశ్రమలోని క్రూరత్వం మరో స్థాయికి చేరుకుందని... ప్రతిభ కలిగిన యువ నటుడిని బలిగొందని మండిపడ్డారు. ఇపుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఇండస్ట్రీ కారణంగా అనేక మంది యువ కళాకారాలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారంటూ సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నబా నటేశ్‌కు ఆ విషయంలో అంత సీనుందా...?