Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ‌మౌళి కొడుకు పెళ్లి: చరణ్-ఎన్టీఆర్‌లకు స్వాగతం పలికిన అనుష్క, ప్రభాస్

Advertiesment
SS Rajamouli
, శనివారం, 29 డిశెంబరు 2018 (12:52 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కొడుకు కార్తికేయ వివాహం జైపూర్ స‌మీపంలోని కూకాస్‌లో ఉన్న ఓ స్టార్ హోట‌ల్‌లో జ‌ర‌గ‌నుంది. కార్తికేయ పెళ్లి చేసుకోబోతుంది ఎవ‌రునో కాదు జ‌గ‌ప‌తి బాబు అన్న కూతుర్ని. ఆమె పేరు పూజ‌. కార్తికేయ‌, పూజ‌ల పెళ్లి ఈ నెల‌ 30న ముహుర్తంగా నిర్ణ‌యించారు. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం హీరోలంతా బ్యాగ్ సర్దుకొని జైపూర్ వెళ్లారు. ప్ర‌భాస్, అనుష్క అంద‌రి కంటే ముందుగా అక్క‌డ‌కి చేరుకున్నారు. చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కు ప్ర‌భాస్, అనుష్క‌, రాజ‌మౌళి స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు. 
 
జ‌గ‌ప‌తి బాబు, రాజ‌మౌళి ఫ్యామిలీతో అక్కినేని ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. అందుచేత నాగార్జున‌, నాగ చైత‌న్య‌, అఖిల్ వీరంద‌రూ కూడా జైపూర్ వెళుతున్నారు. రానా, నాని ఆల్రెడీ జైపూర్ చేరుకున్నారు. మ‌రి కొంత మంది హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, సీనియ‌ర్ న‌టులు జైపూర్ వెళ్ల‌నున్నారు. అంతే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ప‌లువురు ప్ర‌ముఖులు ఈ పెళ్లికి హాజ‌రు కానున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌జ‌నీకాంత్ 'పేట' తెలుగు రైట్స్‌ని ఎన్ని కోట్ల‌కు కొన్నారో తెలుసా..?