Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి సినిమా.. బడ్జెట్ రూ.500 కోట్లు?

దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోనే కార

Advertiesment
SS Rajamouli
, మంగళవారం, 21 నవంబరు 2017 (17:25 IST)
దర్శక ధీరుడు రాజమౌళి తాజాగా చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు రాజమౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోనే కారణం. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి కలిసి తీసిన ఫోటోను జక్కన పోస్ట్ చేశాడు.

చెర్రీ, ఎన్టీఆర్‌లను చెరో పక్కన కూర్చోబెట్టి తీసిన ఫోటోను చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. రాజమౌళి ఇద్దరికీ కథను వినిపించారని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటుండగా.. ఇవన్నీ మీ ఊహకే వదిలేస్తున్నా అన్నట్లు ఈ ఫొటోకు రాజమౌళి క్యాప్షన్ పెట్టారు.
 
ఈ నేపథ్యంలో తాజాగా.. చెర్రీ, ఎన్టీఆర్‌తో రాజమౌళి చేసే సినిమా ఏకంగా రూ.500కోట్లకు చేరుతుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. చెర్రీ, ఎన్టీఆర్‌లతో రాజమౌళి సినిమా చేస్తే అది కచ్చితంగా బాహుబలి బడ్జెట్‌ను మించి.. మల్టీస్టారర్‌కే మల్టీస్టారర్ అయిపోతుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
స్టూడెంట్ నెంబర్1తో ఎన్టీఆర్‌కి స్టార్ డమ్ ప్రసాదించి, సింహాద్రి, యమదొంగతో డూపర్ హిట్‌లను అందించాడు.. జక్కన్న. అలాగే చెర్రీతో మగధీర సినిమా తీసి అదుర్స్ అనిపించుకున్నాడు.

ఇప్పటికే రాజమౌళి తన తదుపరి చిత్రం డి.వి.వి.దానయ్యకు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఏ హీరోతో చేస్తారని ఇంకా ప్రకటించలేదు. దీంతో ఎన్టీఆర్-మిస్టర్ సితో కలిసి జక్కన్న సినిమా చేస్తారేమోనని సినీ జనం అనుకుంటున్నారు. ఒకవేళ సినిమా ఖరారైతే 2018 జూన్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోకేశ్‌ నంది అవార్డులు నీ అబ్బసొమ్మా.. ఆంధ్ర వాళ్లు రోహింగ్యాలా? : పోసాని