Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ అనారోగ్యంతో మృతి - శ్రీరెడ్డి పోస్ట్ వైరల్

Sirish

సెల్వి

, బుధవారం, 19 జూన్ 2024 (11:14 IST)
అనారోగ్యంతో శిరీష్ భరద్వాజ్ మృతి చెందాడు. ఇతను మెగా డాటర్ శ్రీజను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే ఆపై ఆమెకు విడాకులిచ్చాడు. కానీ లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చేరిన శిరీష్ భరద్వాజ్ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో శ్రీజను వివాహం చేసుకున్న శిరీష్.. విడాకుల అనంతరం మరో పెళ్లి చేసుకున్నాడు.
 
2007లో శ్రీజ-శిరీష్ భరద్వాజ్ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అది పెద్ద వివాదమే అయింది. అయితే ఒక బిడ్డ పుట్టిన తర్వాత 2011లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం శ్రీజ 2016లో బిజినెస్‌మ్యాన్ కళ్యాణ్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందినట్లుగా నటి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. "శిరీష్ భరద్వాజ్ ఇక లేరు. ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్. అందరూ నిన్ను మోసం చేశారు" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టార్‌ వార్స్ లాంటి చూశాక ఇవి మన కథలు కావా? అనిపించేది : కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్