Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#RipSanam- ఒకే రోజు ఇద్దరు నటుల మృతి.. ఆ రోగాలు మింగేశాయి..

#RipSanam- ఒకే రోజు ఇద్దరు నటుల మృతి.. ఆ రోగాలు మింగేశాయి..
, శనివారం, 2 మే 2020 (17:43 IST)
Sidharth Jamwal
బాలీవుడ్‌ నటుడిని కరోనా మింగేసింది. నిన్నటికి నిన్న ఇద్దరు స్టార్ హీరోలను బాలీవుడ్ కోల్పోయింది. శనివారం మరో యువ నటుడిని బాలీవుడ్ కోల్పోయింది. సహ నటుడిగా మంచి గుర్తింపు పొందిన సిద్ధార్థ్ జమ్వాల్‌తో పాటు మరో యువ నటి సనమ్ కూడా ప్రాణాలు కోల్పోయింది. వీరిద్దరూ కోవిడ్-19, క్యాన్సర్లకు బలైపోయారు. ఇద్దరూ ఒకే రోజు ప్రాణాలు కోల్పోవడం బాలీవుడ్‌ను విషాదంలో ముంచెత్తింది. 
 
సిద్ధార్థ్ జమ్వాల్ శుక్రవారం రాత్రి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా, సనమ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో మృతి చెందింది. సిద్ధార్థ్ కరోనా సోకడంతో కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఇక సనమ్ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ వచ్చింది. కానీ ఇద్దరూ ఒకే రోజున ప్రాణాలు కోల్పోవడంపై సోషల్ మీడియాలో వారి ఫ్యాన్స్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమానులు కోల్పోయామని బాధను వెల్లగక్కుతున్నారు. ఇంకా సినీ ప్రముఖులు వీరి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంత పిన్న వయస్సులోనే ఈ లోకం వదిలి వెళ్లిపోవడంపై ఘోరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సొంత అక్కే మోసం చేసింది.. డబ్బంతా నొక్కేసింది.. షకీలా