Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బన్నీ ఫంక్షన్‌ను పక్కనబెట్టి.. మహేష్ కోసం వస్తున్న మెగాస్టార్

బన్నీ ఫంక్షన్‌ను పక్కనబెట్టి.. మహేష్ కోసం వస్తున్న మెగాస్టార్
, ఆదివారం, 5 జనవరి 2020 (13:28 IST)
సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరు అవ్వనున్నారు.
 
ఇదే సమయంలో జరగనున్న ఆల వైకుంఠపురంలో వేడుకకు మాత్రం ముఖ్య అతిథిగా ఎవ్వరు రావడంలేదట. టాలీవుడ్‌లో చిరును మించిన గెస్ట్ ఎవ్వరు లేరని, ఒకవేళ అల వైకుంఠపురం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మరొకరిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే మెగాస్టార్ స్థాయిని తక్కువ చేసినట్లు అవుతుందని బన్నీ భావిస్తున్నాడట. అందుకే చీఫ్ గెస్ట్ గా ఎవరిని పిలవద్దని దర్శక, నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో ఎవర్ని పిలవకుండానే వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ అనుకుంటుందట.
 
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురం మూవీ వస్తున్నా సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

96కి తర్వాత సమంత అక్కినేని సినిమా అదే.. చీరకట్టు ఫోటోలు వైరల్