Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం... సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ మృతి

praveen anumolu
, సోమవారం, 6 మార్చి 2023 (08:50 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మరో విషాదం సంభవించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ అనుమోలు గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 2017లో వచ్చిన 'దర్శకుడు' చిత్రానికి ప్రవీణ్ అనుమోలు తొలిసారి కెమెరామెన్‌గా పని చేశారు. 
 
ఆ తర్వాత 'బాజీరావు మస్తానీ', 'ధూమ్ 3', 'బేబీ', 'పంజా', 'యమదొంగ' వంటి చిత్రాలకు ఆయన ఛాయాగ్రహణం సమకూర్చారు. దర్శకుడు కె.విశ్వనాథ్, హీరో తారకరత్న మృతి నుంచి చిత్రపరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో విషాదం చోటు చేసుకోవడాన్ని సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 
సుకుమార్ వంటి దర్శకుల చిత్రాల్లో అసిస్టెంట్ కెమెరామెన్‌గా పని చేసిన ప్రవీణ్ అనుమోలు.. ఆ తర్వాత జక్కా హరి ప్రసాద్ దర్శకత్వం వహించిన చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా మారారు. ఇందులో అశోక్ భానురెడ్డి, ఈషా రెబ్బాలు హీరోహీరోయిన్లుగా నటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి కుటుంబలో మరో హీరో చైతన్యకృష్ణ సినిమా బ్రీత్